
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానంలో లోకకల్యాణం కోసం ఈ రోజు (23.05.2021) న
రాత్రి శ్రీ స్వామి అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం జరిగింది.ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి , మూల నక్షత్రం రోజులలో (సర్కారి సేవగా) నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపారు.
అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచార పూజలు చేసారు. తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీలో వేంచేబు చేయించి పల్లకీ ఉత్సవం జరిపారు.అర్చకస్వాములు కోవిడ్ నిబంధనలతో భౌతికదూరాన్ని పాటిస్తూ పల్లకీ ఉత్సవపూజలు నిర్వహించారు.