ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు మంగళవారం మధ్యాహ్నం శ్రీశైలం క్షేత్రం చేరుకున్నారు . ఆయనకు అధికారులు స్వాగతం పలికారు . ముందుగా శృంగేరి మఠానికి చేరుకొన్నారు . అక్కడ విడిది చేసిన శృంగేరి పీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ విదుశేఖర భారతీ స్వామి వారిని దర్శించి వస్త్ర సమర్పణ చేసారు . శ్రీ స్వామి వారు మంత్రిని ఆశీర్వదించారు . అనంతరం ఆలయ రాజగోపురం వద్ద మంత్రికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి , అర్చక స్వాములు , వేదపండితులు స్వాగతం పలికారు . అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో మంత్రిని సత్కరించారు . వేద ఆశీర్వచనం చేసారు . శ్రీస్వామి అమ్మవారి శేష వస్త్రాలు , ప్రసాదం . దేవస్థానం జ్ఞాపికను అందించారు .