భద్రాద్రి మిథిలాప్రాంగణం లో సోమవారం శ్రీ సీతారామ కల్యాణం వైభవంగా జరిగింది . మనోహరంగా తీర్చిదిద్దిన వేదికపై అభిజిద్ లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నం 12 కి రామచంద్రుడు సీతమ్మ శిరస్సుపై జీలకర్రబెల్లం ఉంచాడు. అనంతరం మాంగల్య ధారణ, వారణ వాయనం, తలంబ్రాలతో కల్యాణ ఘట్టం ముగిసింది. వేలమంది భక్తులు రాములోరి పెళ్లి ని తిలకించి పులకించారు.
రాష్ట్రప్రభుత్వం పక్షాన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేయగా, జిల్లామంత్రి తుమ్మలనాగేశ్వరరావు,మంత్రి శ్రీనివాసయాదవ్ పాల్గొన్నారు.శ్రీరంగం,తిరుమల దేవస్థానాల వారు స్వామివారికి, అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు.
చిన్నజీయర్ స్వామి పక్షాన దంపతులకు వస్త్రసమర్పణ చేశారు.
రేపు పట్టాభిషేకం జరుగనుంది.