సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో మంగళవారం రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆయనతోపాటు గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.- చైతన్య, గజ్వేల్.