అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ద్రోణంరాజు శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎండీఆర్ఏ) చైర్మన్గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ద్రోణంరాజు శ్రీనివాస్ గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా బాధ్యతలు నిర్వహించారు.