గ్రీన్ దీపావళితో పర్యావరణ పరిరక్షణ:మంత్రి జోగు రామన్న
దీపావళి పండుగ భారతీయ సంస్కృతిలో ఒక భాగమని, అలాంటి పండుగను ఒకప్పుడు మట్టిదీపాలు, దివిటీలు తిప్పుతూ జరుపుకునేవారని అలానే ఈ ఏడాది కూడా నిర్వహించుకుందామని రాష్ట్ర పర్యావరణ, బిసి శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు.
బుధవారం ఆయన శ్వాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రీన్ దీపావళి జరుపుకోవాలని కోరుతూ రూపొందించిన పోస్టర్ ను సచివాలయంలోని తన చాంబర్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ దీపావళి కాలుష్య భూతంగా మారుతోందని, ఇది మానవ జీవనంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపెడుతుందన్నారు. నేటి జీవన విధానం, పండుగలు జరుపుకునే తీరు పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయన్నారు. ఒకప్పుడు పెద్ద ఎత్తున టపాసులు కాల్చేవారు కాదని, కొత్తబట్టలు వేసుకుని పిండివంటలు చేసుకుని ఆటపాటలతో, మట్టిదీపాలు అలంకరించి దివిటీలతో తిప్పుతూ పండుగ చేసుకునేవారని పేర్కొన్నారు. ఇవి ప్రకృతికి పెద్దగా నష్టం కలిగించేవి కాదని, కానీ ప్రస్తుతం పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చడం వల్ల శబ్ద, వాయు కాలుష్యం ఏర్పడి మానవ ఆరోగ్యంపైనా, పెంపుడు జంతువులపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు. ప్రస్తుతం భూగోళం వేడిక్కిపోతోందని, వాతావరణంలో పెద్ద ఎత్తున మార్పులు సంభవిస్తుయన్నారు. ఇప్పటి జీవన విధానాన్ని బట్టి పండుగలు చేసుకునే తీరు ప్రకృతికి నష్టం కలిగించని రీతిలో జరుపుకోవాల్సిన అవసరం ఏర్పడిందని మంత్రి స్పష్టం చేశారు. అందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రకృతి పరంగా ఎక్కువ నష్టం జరగకుండా దీపావళిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. శ్వాస ఫౌండేషన్ అధ్యక్షురాలు జి.కళ్యాణి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి చేతిలో ఉందని, అందరూ పర్యావరణహిత దీపావళిలో భాగం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్వాస ఫౌండేషన్ ప్రతినిధులు రాఘవేంద్ర, రవి రామకృష్ణ, వేణు మాధవ్, తదితరులు పాల్గొన్నారు.
అభినందనలతో
జి.కళ్యాణి
శ్వాస ఫౌండేషన్ అధ్యక్షురాలు
9000507222