కృష్ణా జిల్లా గూడూరు మండలానికి చెందిన 200 మంది భక్తులు గురువారం శ్రీశైలం చేరుకున్నారు.దివ్యదర్శనం సౌకర్యం కింద శ్రీశైలం వచ్చారు. దేవస్థానం రాజగోపురం వద్ద అర్చకస్వాములు, అధికారులు వీరికి స్వాగతం పలికారు .శ్రీస్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు. భక్తులకు ప్రసాదం అందించారు. దేవస్థానంవారు వివిధ సదుపాయాలు కల్పించారు.