26 వ పాశురము: దేవుడి దయనే కృపా వర్షం
మాలే ! మణివణ్ణా ! మార్గళి నీరాడువాన్
మేలైయార్ శెయ్ వనగళ్ వేణ్డువన కేట్టియేల్
ఞాలత్తై యెల్లామ్ నడుఙ్గ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్ పాఞ్జశన్నియమే
పోల్వన శఙ్గఙ్గళ్, పోయ్ ప్పాడుడై యనవే
శాల ప్పెరుమ్ పఱైయే, పల్లాణ్డిశైప్పారే
కోలవిళక్కే, కొడియే, విదామే
ఆలినిలైయాయ్ ! అరుళేలో రెమ్బావాయ్.
ఈ పాశురంలో ఆండాళ్ గోష్ఠి తమకు ఏమేమి కావాలో అడుగుతున్నారు.
*ఓ నారాయణ! నీల మేఘవర్ణుడ! మేము మార్గళి లో స్నానం చేయదలిచాము. మా పెద్దలు ఆచరించిన దానినే మేము ఆచరిస్తున్నాము.మాకు కావలసినవి చెబుతాము వినవయ్యా. ప్రపంచానంత గడగడలాడించే నాదము చేయ గల నీ పాంచజన్యము పోలిన తెల్లని పాలవలె ఉండే శంఖము కావాలి.పల్లండు పాడే వాళ్లు కావాలి.ఎప్పుడు వెలుగుతుండే దీపము,ధ్వజము, ఛత్రము కావాలి.మర్రి ఆకు మీద బాలుడువలె పడుకొని లోకము గాచిన స్వామి! మాకు అన్నియు ఈయగల సమర్థుడవు నీవు .నీ దయనే మాకు కావాలి