అన్నమాచార్య కీర్తనలపై విశేష పరిశోధనలు చేసిన మహా పండితుడు డాక్టర్ కామిశెట్టి శ్రీనివాసులు ఇవాళ మధ్యాహం మూడు గంటలకు హైదరాబాద్ లో కనుమూశారు ! కడప కు చెందిన శ్రీనివాసులు గారి ఆలోచన మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేసి వ్యవస్థాపక సంచాలకులుగా శ్రీనివాసులు గారిని నియమించింది! శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేసి తొలి డైరెక్టర్ గా వారినే నియమించి స్వామి వారి కీర్తనలను రికార్డు చేయించింది ! మహా గాయని భారతరత్న ఎమ్మెస్ సుబ్బులక్ష్మి చే శ్రీ వెంకటేశ్వర పంచరత్న మాలిక పాడించి రికార్డు చేయించిన ఘనత కూడా శ్రీనివాసులు దే! అమెరికా లో అన్నమయ్య కీర్తనలకు విశేష ప్రాచుర్యం కల్పించిన మహానుభావులు శ్రీనివాసులు లేని లోటు తీరనిది! అన్నమయ్య కీర్తనలు ఉన్నంత కాలం శ్రీనివాసులు ని మరచిపోదు ఈ ఆధ్యాత్మిక గడ్డ! వారికి భక్త లోకం ఘన నివాళులు.