హైదరాబాద్ ఎర్రగడ్డలోని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ-ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా ధన్వంతరి జయంతి ధన్వంతరి యాగం నిర్వహించి పూర్ణాహుతి చేసిన ఆయుర్వేద వైద్యులు
ముఖ్య అతిథిగా పాల్గొన్న వీఐడీ ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మా రెడ్డి కి పూర్ణాహుతితో స్వాగతం
మంత్రి లక్ష్మా రెడ్డి – ఆయుర్వేదం ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వైద్య విధానం అల్లోపతి వైద్యం అందుబాటులోకి వచ్చాక నిరాదరణ మొదలైంది ఆయుర్వేదానికి పూర్వ వైభవం తేవాల్సిన అవసరం ఉంది ప్రత్యామ్నాయ ఔషధాల వైపు ప్రపంచం మళ్ళీ చూస్తున్నది భారత వైద్యం ప్రపంచంలోనే గుర్తింపు ఉన్న వైద్యం ఆయుష్ వైద్య విధానాల మీద ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఆయుష్ విభాగానికి మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేయడం ఈ వైద్య ప్రాముఖ్యతకు నిదర్శనం కేంద్రం తరహాలోనే తెలంగాణ రాష్ట్రము కూడా ఆయుష్ వైద్య విధానం, ఆయుర్వేదానికి తగిన గుర్తింపు తోనే అభివృద్ధి పరచడానికి చర్యలు తీసుకుంటున్నది ప్రజా అభిరుచికి తగ్గట్లుగా వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఏ విధానానికి ఉండే ప్రాధాన్యం, విలువలు ఆయా విధానాలకి ఉన్నాయి అన్ని విధానాలలో మంచిని మనం గుర్తించి గ్రహించాలి ప్రజలకు అందించాలి ఆయుష్ అన్ని వైద్య సేవలు ఒకే చోట అందే విధంగా చూడాలి.
రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో, 20 పడక ల ఆయుష్ సముదాయాల ఏర్పాటుకు నిర్ణయించాం ప్రకృతి వైద్య విధానాన్ని కూడా మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది భారతీయ ఆయుర్వేద వైద్యానికి మంచి రోజులు వచ్చాయి ప్రజల్లో ఈ వైద్యం పట్ల అవగాహన కల్పించాలి ఆయుర్వేద కాలేజీ అభివృద్ధికి పటు పడతాము అన్ని సాడుబయలు కల్పిస్తాము ఆయుర్వేద వైద్య ఖాళీల భర్తీ, కొత్త పోస్టుల నియామకాలు చేపడతాము ఆయుర్వేదంతో మధుమేహ వ్యాధి నివారణ సమాచారాన్ని, ఆయుర్వేద విశిష్టతను తెలిపే పోస్టర్ ను మంత్రి లక్ష్మా రెడ్డి విడుదల చేశారు
ఈ కార్యక్రమంలో జూబ్లీ హిల్స్ MLA మాగుంట గోపీనాథ్, మహబూబ్ నగర్ MLA శ్రీనివాస్ గౌడ్, GHMC డీప్యూటీ మేయర్ బాబా ఫేసిఉద్దీన్, స్థానిక కార్పొరేటర్ మనోహర్, వైద్య ఆరోగ్య శాఖా ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, ఆయుష్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, కాలేజి ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్,
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ ఆయుర్వేద వైద్యులు హాజరయ్యారు అంతకు ముందు మంత్రి లక్ష్మారెడ్డి ఆయుర్వేద కాలేజీ ని పరిశీలించారు