శ్రీశైలం దేవస్థానం దక్షిణమాడ వీధిలోని హరిహరరాయగోపురం వద్ద ఆదివారం సాయంత్రం కళారాధన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది . కర్నూలు జిల్లా లాస్య కూచిపూడి కళాక్షేత్రం వారు సంప్రదాయ నృత్యం ఏర్పాటు చేసారు .ఈ కార్యక్రమంలో అనేక సంప్రదాయ గీతాలకు చరణ్య , శ్రీమతి శిరీష , కుమారి హర్షిత , సహస్రసాయి ఆశ్రిత , అంజిబాబు తదితరులు నృత్య ప్రదర్శన చేసారు .