అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ-ఏప్రిల్ 30 న కుంభోత్సవం

శ్రీశైల దేవస్థానం :చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారం రోజున ( ఏ రోజు ముందుగా వస్తే ఆ రోజు) శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సంవత్సరం ఏప్రిల్ 30 న ఈ కుంభోత్సవం నిర్వహిస్తారు.

అమ్మవారికి సాత్త్వికబలి నిర్వహించేందుకు ( కొబ్బరికాయలు,గుమ్మడికాయలు, నిమ్మకాయలు, మొదలైనవి  సమర్పించడం) ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితి.కుంభోత్సవం రోజున స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం. .

కాగా ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం,  శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పించడం జరుగుతోంది. ఇందులో భాగంగా మంగళవారమైన ఈ రోజున (16.03.2021) అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ముందుగా అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు,కుంకుమలతో వాటికి పూజాదికాలు చేసి తరువాత  కొబ్బరికాయలు సమర్పించారు.

*Traditional puja performed to Kumara Swami, Nandheeshwara swamy ,Bayalu Veerabhadra Swami  in the temple today by Archaka swaamulu.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.