శ్రీశైల దేవస్థానం స్వామివార్ల సేవలో పీఠాధిపతి
శ్రీశైల దేవస్థానం:వీరశైవ పంచాచార్య మహాపీఠాలలో ఒకటైన శ్రీశైల పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామివారు బుధవారం శ్రీ స్వామిఅమ్మవార్లను సేవించారు.
కర్నాటక నుండి శ్రీశైలానికి పాదయాత్రతో విచ్చేసిన పీఠాధిపతి వారికి ఈ ఉదయం దేవస్థానం టోల్ గేట్ వద్ద ధర్మకర్తల మండలి అధక్షులు రెడ్డి వారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి యస్. లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరుపాక్షయ్య స్వామి, శ్రీమతి డా. కనక దుర్గ, అర్చకస్వాములు, వేదపండితులు పలు విభాగాల అధికారులు తదితరులు ఆహ్వానం పలికారు.
ఆలయం వద్దకు చేరుకున్న పీఠాధిపతి వారికి సంప్రదాయాన్ని అనుసరించి రాజగోపురం వద్ద ధర్మకర్తల మండలి అధక్షులు, కార్యనిర్వహణాధికారి, ధర్మకర్తల మండలి సభ్యులు అర్చకులు, వేదపండితలు పూర్ణకుంభస్వాగతం పలికారు. తరువాత పీఠాధిపతివారు శ్రీ స్వామివారికి సంప్రదాయబద్ధంగా అభిషేకాన్ని జరిపించుకున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు.తరువాత అమ్మవారి ఆలయము ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో కార్యనిర్వహణాధికారి, ధర్మకర్తల మండలి సభ్యులు, వేదపండితులు పీఠాధిపతివారికి దేవస్థానం తరుపున వస్త్ర సమర్పణ చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతి భక్తులందరినీ ఆశీర్వదించారు.
Post Comment