×

శ్రీ స్వామి అమ్మవార్ల సేవలో పాల్గొన్న న్యాయమూర్తులు

శ్రీ స్వామి అమ్మవార్ల సేవలో పాల్గొన్న న్యాయమూర్తులు

నంద్యాల/ శ్రీశైలం,(29-05-2022):ఆదివారం తెల్లవారుజామున   శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి మహా మంగళహారతి దర్శనానికి విచ్చేసిన  సుప్రీంకోర్టు న్యాయమూర్తి  జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ , ఆయన సతీమణి శ్రీమతి అమిత ఉదయ్ లలిత్‌ లకు,  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులకు రాజగోపురం వద్ద మంగళవాయిద్యాలతో అర్చక స్వాములు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం వారిని ఆలయంలోకి తీసుకు  వెళ్ళారు. రత్నగర్భ గణపతి పూజ, శ్రీ మల్లికార్జున స్వామి వారి సుప్రభాత సేవ, మహా మంగళ హారతి కార్యక్రమంలో పాల్గొని, గర్భగుడిలోని మూలవిరాట్ కు రుద్రాభిషేకం చేసారు. అనంతరం భ్రమరాంబ అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు.

పూజల అనంతరం వారికి వేద ఆశీర్వచనముతో శ్రీ స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞాపిక అందించి సత్కరించారు. వారి వెంట కర్నూలు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి రాధాకృష్ణ కృపా సాగర్‌ , దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులురెడ్డివారి చక్రపాణి రెడ్డి, దేవస్థాన కార్య నిర్వహణాధికారి ఎస్. లవన్న తదితరులు వున్నారు.

print

Post Comment

You May Have Missed