×

శ్రీశైల దేవస్థానంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి

శ్రీశైల దేవస్థానంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి

శ్రీశైల దేవస్థానం: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి బుధవారం శ్రీశైల దేవస్థానంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా  శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.  దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డి ఇతర సభ్యులు ,ఈ ఓ  ఎస్.లవన్న ఇతర అధికారులు, అర్చక స్వాములు స్వాగతం పలికారు.సాక్షిగణపతి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మృత్తికా గణపతి వద్ద   జి. కిషన్ రెడ్డి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న , ధర్మకర్తల మండలి సభ్యులు, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు తదితరులు ప్రత్యక పూజలు నిర్వహించారు.కర్ణాటక ప్రభత్వ అతిథి గృహం వద్ద యాత్రికుల సౌకర్య కేంద్రాన్ని కేంద్ర మంత్రి పరిశీలించారు. దేవస్థానంలో గో సంరక్షణ పనులు పరిశీలించారు.

print

Post Comment

You May Have Missed