
వివిధ సమస్యలు అలుముకున్న చీకటి సమాజానికి వెలుగునిచ్చిన మహనీయుడు బాబా సాహెబ్ డా| బీఆర్.
అంబేద్కర్ అని తెలంగాణా రాష్ట్ర బీసి కమిషన్ చైర్మెన్ డా.వకుళాభరణం కృష్ణ
మోహన్ రావు అన్నారు.
బాబాసాహెబ్ 66 వ వర్దంతి సందర్పంగా ట్యాంక్ బండ్ వద్ద బీ.ఆర్.
అంబేద్కర్ విగ్రహానికి డా! వకుళాభరణం పూలమాల వేసి ఘన నివాళులు
అర్పించారు. ఈ సందరృంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగకర్తగా, న్యాయ
నిపుణుడుగా, రాజ నీతిజ్జుడుగా, ఆర్దిక వేత్తగా, సామాజిక న్యాయవేత్తగా అంబేద్కర్
సేవలు చరిత్ర మరువలేనివి అన్నారు. ఇప్పుటికీ ఆయన
ఆశయ సిద్ది సంపూర్ణం కాలేదని, ఆ దిశగా ఆయన సిద్దాంత వారసులందరూ
నిరంతరం పరిశ్రమించి సాధించడమే ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని డా॥
వకుళాభరణం అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం,
ప్రపంచంలోనే ఎత్తైన 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండడం పట్ల డా॥
వకుళాభరణం సిఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆ మహనీయుని స్పూర్తితో
అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండడం ఈ ప్రభుత్వ నిబద్దతకు నిదర్శనం
అన్నారు.