
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న “నిత్యకళారాధన” (నివేదన) కార్యక్రమంలో భాగంగా ఈరోజు (05.11.2021) న శ్రీ నృత్య కళారాధన, శ్రీశైలం వారు సంప్రదాయనృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:30 ని||ల నుండి ఈ భజన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో శివుడు తాండవం. శివమంజీరనాదం, శంభో శివ శంభో, అయ్యా శివయ్య, కైలాసంలో శివుడు తాండవము, ఓం హర హర శంభో శంకర, శివతాండవం తదితర గీతాలకు పూజ, యశస్విని, వింద్య, దనుశ్రీ, కామాక్షి రోహిత తదితరులు నృత్య ప్రదర్శనను చేసారు.
ఆర్. జగదీష్ భాగవతార్ నంద్యాల వారు భూకైలాస్ హరికథ కార్యక్రమం సమర్పించారు.
ఈ నిత్య కళారాధనలో ప్రతి రోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని, ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్య కళారాధన (నివేదన) కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమాలలో ముఖ్యంగా స్థానిక కళాకారులకు అనగా జిల్లాలోని కళాకారులకు ప్రాధాన్యం ఇస్తారు.
రేపటి నిత్య కళారాధన:
రేపు (06.11.2021) కె. రమేష్ కుమార్ శ్రీలక్ష్మీశ్రీనివాస నృత్యాలయం, తూర్పుగోదావరి జిల్లా మరియు శ్రీమతి జి.వి.యల్. ఉష అండ్ బృందం, ఏలూరు వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసారు.