శ్రీశైల దేవస్థానం:ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శనివారం శ్రీ లలిత కళావేదిక, విజయవాడ వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది .
ఈ కార్యక్రమం లో శ్రీవిఘ్నం రాజంభజే, శివపంచాక్షరీ, అఖిలాండేశ్వరి, శంభో శివశంభో, తాండవనృత్యకరీ, ఓం నమశ్శివాయ తదితర గీతాలకు దేవిక, భవిష్య, కీర్తి, బిందు, చైత్ర, తరుణి తదితరులు నృత్య ప్రదర్శన చేశారు.
కాగా ఈ నిత్య కళారాధనలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
