
శ్రీశైల దేవస్థానం: దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శనివారం శ్రీ పద్మావెంకటేశ్ , బృందం, సికింద్రాబాద్ వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో వినాయక పంచరత్నాలు, మహిషాసురమర్ధిని, శివ తాండవం, శంభో శివశంభో, అయిగిరినందిని, శివశివశంకరా తదితర గీతాలకు లాస్య, లక్షిత, సునంద, గాయత్రీ అరుణ్ కుమార్, సంకీర్తన, కీర్తన, గాయత్రి, భవానీ మోహన్ తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.
కాగా ఈ నిత్య కళారాధనలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
శ్రీస్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని ,ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన జరుగుతోంది