శ్రీశైల  దేవస్థానంలో ముగ్గురు ఉద్యోగుల పదవీ విరమణ

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల  దేవస్థానంలో  విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఉద్యోగులు ఈ రోజు (30.06.2021)న  వయసు రీత్యా ఉద్యోగవిరమణ చేసారు.శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి బదిలీపై ఈ దేవస్థానం లో విధులు నిర్వహిస్తున్న ఎస్. వెంకటేశ్వర రాజు, జూనియర్ అసిస్టెంట్, ఈ దేవస్థానంలో  నియమితులైన  శ్రీమతి కె. రత్నమ్మ, అటెండరు,  ఎం. వెంకటరాముడు, అటెండరు  ఈ రోజు ఉద్యోగ విరమణ చేసినవారిలో ఉన్నారు.

 ఎస్. వెంకటేశ్వరరాజు 21 సంవత్సరాలపాటు, శ్రీమతి రత్నమ్మ సుమారు 30 సంవత్సరాల పాటు,  వెంకటరాముడు 27 సంవత్సరాలపాటు విధులను నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి  కే ఎస్.రామరావు  వీరికి శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు.

సాధారణంగా దేవస్థానంలో  ఉద్యోగవిరమణ చేసే  సిబ్బందికి వీడ్కోలు సమావేశం నిర్వహిస్తారు.అయితే ప్రస్తుత కోవిడ్ నిబంధనల కారణంగా సమావేశం నిర్వహణ  నిలిపివేశారు .

ఈ కార్యక్రమం లో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, పర్యవేక్షకులు శ్రీహరి శ్రీనివాసులు, అయ్యన్న, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ( ఐ/సి) శ్రీనివాసరెడ్డి, దేవస్థాన ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు  పి.వి. సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

*సాక్షి గణపతి అభిషేకం,వీరభద్రస్వామి పూజ నియమానుసారం జరిపారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.