
శ్రీశైల దేవస్థానం: స్వచ్ఛ శ్రీశైలం కార్యక్రమాలలో భాగంగా శనివారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం జరిగింది.
మనఊరు – మనగుడి – మన బాధ్యత స్వచ్ఛంద సేవాసంస్థ, నంద్యాల జిల్లా విభాగం వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సంస్థకు చెందిన సుమారు 180 మందికి పైగా స్వచ్ఛంద సేవకులు క్షేత్ర పరిధిలోని పలుచోట్ల స్వచ్ఛతా కార్యక్రమాలకు హాజరయ్యారు.
ఈ రోజు ఘంటామఠం ప్రాంగణం, గంగాభవానీ స్నానఘట్టాలు, పాతాళగంగ స్నానఘట్టాలు, శిఖరేశ్వరాలయం వద్ద పుష్కరిణి మొదలైన చోట్ల వీరు స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా 19 న ఏనుగుల చెరువుకట్టవద్ద పారిశుద్ధ్య పనులను నిర్వహిస్తారు.
కాగా ఇప్పటికే ఈ సంస్థవారు ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు పలు ఇతర రాష్ట్రాలలోని 123 ఆలయాలలో స్వచ్ఛత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా ఆ సంస్థ వ్యవస్థాపకులు యం.వి శివ కుమార్ రెడ్డి తెలియజేశారు. మన రాష్ట్రంలోని అహోబిళం, కసాపురం, ఒంటిమిట్ట, కాల్వబుగ్గ, మంత్రాలయం తదితర క్షేత్రాలలో ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన అన్నారు..
ఈ రోజు పలుచోట్ల జరిగిన స్వచ్ఛతా కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈ ఓ మాట్లాడుతూ స్వచ్ఛ శ్రీశైలం లక్ష్యసాధనలో భాగంగా క్షేత్రపరిధిలో విస్తృతంగా పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నామన్నారు . అందులో భాగంగానే మనఊరు – మనగుడి – మన బాధ్యత సంస్థ వారు ఈ స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారన్నారు . ఆ సంస్థ స్వచ్ఛంద సేవకులందరు కూడా ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం తరుపున వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అందరి సహకారంతోనే క్షేత్రాన్ని పరిశుభ్రంగా ఉంచడం వీలవుతుందన్నారు.ప్రతి గురువారం కూడా క్షేత్రపరిధిలో ఈ విస్తృత పారిశుద్ధ్య కార్యక్రమం వుంటుందన్నారు ఈ ఓ. దేవస్థానం సిబ్బందితో పాటు స్థానికులందరు కూడా ఈ కార్యక్రమములో పాల్గొని స్వచ్ఛ శ్రీశైల కార్యక్రమానికి సహకరించాలన్నారు.న్నారు.