హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ.3,87,79,312–లు నగదు రాబడి-ఈ ఓ  ఎస్.లవన్న

శ్రీశైల దేవస్థానం:శుక్రవారం  జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ.3,87,79,312–లు నగదు రాబడిగా లభించిందని ఈ ఓ  ఎస్.లవన్న తెలిపారు.ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 16 రోజులలో (23.03.2022 నుండి 07.04.2022 వరకు) సమర్పించారన్నారు.

ఈ నగదుతో పాటు 229 గ్రాముల బంగారు, 6 కేజీల 100 గ్రాముల వెండి లభించాయి. 111 యు.ఎస్.ఏ డాలర్లు, 100 కత్తారు రియాల్స్, 60 కువైట్ దినార్స్, 10 యు.ఏ.ఈ దిర్హమ్స్, 2 సింగపూర్ డాలర్లు, 1 మలేషియా రింగిట్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీరి లెక్కింపులో లభించాయని ఈ ఓ వివరించారు.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేశారన్నారు.

ఈ ఓ  ఆధ్వర్యంలో జరిగిన ఈ హుండీల లెక్కింపులో ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి ఎస్. మాధవీలత, డా. శ్రీమతి కనకదుర్గ, శ్రీమతి విజయలక్ష్మీ దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed