
శ్రీశైల దేవస్థానం:శనివారం శ్రీశైల దేవస్థానం హుండీల లెక్కింపు ద్వారా రూ. 5,60,66,953/-లు నగదు రాబడిగా లభించిందని ఈ ఓ ఎస్.లవన్న వెల్లడించారు.ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 15 రోజులలో (18.02.2022 నుండి 04.03.2022 వరకు) సమర్పించారు.
ఈ నగదుతో పాటు 403 గ్రాముల బంగారు, 10 కేజీల 400 గ్రాముల వెండి లభించాయి. 185 యు.ఎస్.ఏ డాలర్లు, 4 సింగపూర్ డాలర్లు, 30 ఇంగ్లాండ్ ఫౌండ్స్, 1 మలేషియన్ రింగిట్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేసామని ఈ ఓ తెలిపారు.
దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది,శివసేవకులుఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.