
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ.2,00,75,148/-లు నగదు రాబడిగా లభించింది. ఈ రోజు (14.07.2021)న హుండీల లెక్కింపు జరిగింది.
ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 28 రోజులలో సమర్పించారు. అలాగే 123 యు.ఎస్.ఏ
డాలర్లు, 25 యు.ఎ.ఇ. దిర్హమ్స్, 25 ఆస్ట్రేలియా డాలర్లు, 3 ఎస్.ఏ.యు రియాల్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా హుండీల లెక్కింపులో లభించాయి.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపు జరిగింది. దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.