
*Pallaki Seva performed in Srisaila temple on 21st March 2021.
* N.Nageswara Reddy, Rajampet, Cuddapah District, A.P. donated Rs.1,01,116/- For Gosamrakshana Nidhi .
*శ్రీశైల దేవస్థానం:కోవిడ్ నివారణ చర్యలపై ఈ రోజు (21.03.2021) న కార్యనిర్వహణాధికారి కె. ఎస్.రామరావు దేవస్థానం అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, దేవస్థానం వైద్యులతో దూరశ్రవణ సమావేశం (టెలికాన్ఫరెన్స్ ) నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు.
స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా. ఎం. సోమశేఖర్ కూడా ఈ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ ఓ మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, సంబంధిత సిబ్బంది అందరు కోవిడ్ నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.అన్ని విభాగాల వారు కూడా పరస్పర సమన్వయం తో కోవిడ్ నివారణ చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.ముఖ్యంగా సిబ్బంది అందరు కూడా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారు అందజేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆదేశించారు.ఉద్యోగులే కాకుండా స్థానికులందరు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ విషయమై ముఖ్యభద్రతా అధికారి, భద్రతా సిబ్బంది స్థానికులతో అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలన్నారు.ముఖ్యంగా ఉద్యోగులు కార్యాలయం లో విధులు నిర్వహించేటప్పుడు కూడా భౌతికదూరం పాటించడం తప్పనిసరి అన్నారు. ఉద్యోగులందరు తరుచుగా చేతులు శుభ్రపరుచుకోవాలన్నారు. యాత్రికులందరు కూడా చేతులు శుభ్రపరుచుకునే విధంగా తగు అవగాహన కల్పించాలన్నారు.ముఖ్యంగా అవసరమైనచోట్ల మరిన్ని లెగ్ ఆపరేటేడ్ శానిటైజర్లను ఏర్పాటు చేయాలన్నారు.
కల్యాణకట్ట, క్యూలైన్ల ప్రవేశం మొదలైన చోట్ల విధులు నిర్వర్తించే సిబ్బంది తప్పనిసరిగా అవసరమైన ముందుజాగ్రత్తలు పాటించడంతో పాటు చేతికి తొడుగులను కూడా ధరించాలని ఈ ఓ ఆదేశించారు.
దర్శన క్యూలైన్లు, ప్రసాద విక్రయకేంద్రం, అన్నప్రసాద వితరణ మొదలైన చోట్ల కూడా ఎటువంటి లోపం లేకుండా సామాజికదూరం పాటించేవిధంగా భద్రతా చర్యలు చేపట్టాలని దేవస్థానం ముఖ్య భద్రతాధికారిని ఆదేశించారు.అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు కూడా క్షేత్రస్థాయిలో రోజువారీ పరిశీలనలను చేస్తూ కరోనా నివారణ చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలన్నారు.
ముఖ్యంగా కరోనా వ్యాప్తి నివారణకై తీసుకోవలసిన ముందుజాగ్రత్తలగురించి దేవస్థాన ప్రసార వ్యవస్థ ద్వారా (మైక్ ద్వారా) నిరంతరం తెలియజేస్తుండాలని శ్రీశైలప్రభ సంపాదకుణ్ణి ఆదేశించారు. ముందుజాగ్రత్త చర్యల గురించి క్షేత్రపరిధిలో మరిన్ని ఫ్లెక్సీబోర్డులను ఏర్పాటు చేయాలని కూడా సంపాదకుణ్ణి ఆదేశించారు.
దేవస్థానం కార్యాలయం, దర్శనక్యూలైన్లు, దేవస్థానం అతిథిగృహాలు, కేశఖండనశాల, మొదలైన అన్నిచోట్ల కూడా గతంలో వలనే తప్పనిసరిగా ధర్మల్ గన్ ద్వారా శరీర ఉష్ణోగ్రతను పరీక్షించాలని సంబంధిత విభాగాధికారులను ఆదేశించారు.అదేవిధంగా క్యూలైన్లు, కేశఖండనశాల, ప్రసాదాల విక్రయకేంద్రం, అన్నప్రసాద వితరణ కేంద్రం మొదలైన అన్నిచోట్ల కూడా చేతులను శుభ్రపరుచుకునేందుకు మరిన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా ఎప్పటికప్పుడు క్యూలైన్లను శుభ్రపరచడం జరుగుతోందని, ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తుండాలని పారిశుద్ధ్య మరియు ఆలయవిభాగాలను ఈ ఓ ఆదేశించారు.గంగాసదన్ – గౌరీసదన్, మల్లికార్జునసదన్ మొదలైన అతిథిగృహాలలోని క్యారిడార్లు మొదలైన వాటిని కూడా శాస్త్రీయ పద్ధతిలో శానిటైజేషన్ చేస్తుండాలన్నారు.కూరగాయలు, పాలపాకెట్లు మొదలైన వాటిని కొనుగోలు చేసిన తరువాత శుభ్రంగా నీటితో కడిగిన తరువాతనే వాటిని వినియోగించే విధంగా స్థానికులలో అవగాహన కల్పించాలని ఆదేశించారు.
పౌష్టిక ఆహారం తీసుకోవడం వలన రోగనిరోధకశక్తి పెరుగుతుందని, పౌష్టిక ఆహారం తీసుకోవడం పట్ల కూడా శ్రద్ధ వహించాలని కార్యనిర్వహణాధికారి సూచించారు.