
శ్రీశైలదేవస్థానం: శ్రీశైలదేవస్థానం కార్తీక మాసోత్సవాలు నవంబరు 5వ తేదీ నుండి డిసెంబరు 4వ తేదీ వరకు జరుగుతాయని ఈ ఓ ఎస్.లవన్న తెలిపారు.
కార్తీకమాస ఏర్పాట్లకు సంబంధించి ఈ రోజు (25.11.2021) న పరిపాలనా భవనంలోని సమావేశ మందిరం లో వివిధ విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, దేవస్థానం వైద్యశాల వైద్యులు, ఉభయదేవాలయాల ప్రధానార్చకులు, స్థానాచార్యులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశం లో స్థానిక రెవిన్యూ, పోలీస్, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైధ్యాధికారిణి తదితరులు కూడా పాల్గొన్నారు. కోవిడ్ నిబంధనలు, భక్తులకు వసతి, మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, శ్రీస్వామిఅమ్మవార్ల ఆర్జిత సేవలు, పారిశుద్ధ్యం, పార్కింగ్, పర్వదినాలలో లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి, కార్తిక పౌర్ణమి రోజన జ్వాలాతోరణం, నదీహారతి ఏర్పాట్లు మొదలైన అంశాలను గురించి సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో వివిధ అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.
సిబ్బందికి ప్రత్యేక విధులు :
భక్తులకు సేవలు అందించేందుకుగాను కార్తికమాసంలో రద్దీ రోజులందు కార్యాలయ సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయిస్తారు.
కోవిడ్ నిబంధనలు : • దర్శనానికి విచ్చేసే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించవలసివుంటుంది.
ఆలయ ప్రవేశానికి తప్పనిసరిగా మాస్క్ ధరించ వలసి ఉంటుంది. • విధిగా భౌతికదూరాన్ని పాటించవలసి ఉంటుంది. • ముఖ్యంగా క్యూలైన్ల పైపులు, ఆలయ ప్రాంగణంలోని కటంజనాలను, మెట్ల మార్గములోని రైలింగులు మొదలైన వాటిని నిర్ణీత సమయాలలో శాస్త్రీయ పద్ధతిలో శానిటైజేషన్ చేస్తారు. • కరోనాను అరికట్టేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు, నివారణ చర్యలు మొదలైన వాటి గురించి భక్తులలో అవగాహన కలిగించేందుకు దేవస్థానం ప్రసార వ్యవస్థ ద్వారా (మైకుద్వారా) ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తారు. కరోనా అరికట్టే విషయమై భక్తులలో అవగాహన కల్పించేందుకు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మరిన్ని ఫ్లెక్సీ బోర్డులను కూడా పలు చోట్ల ఏర్పాట్లు వుంటాయి.
దర్శనం ఏర్పాట్లు :
గత సంవత్సరం వలెనే ఈ సంవత్సరం కూడా కార్తికమాసం అంతా స్పర్శ దర్శనం పూర్తిగా
నిలుపుదల చేసారు. భక్తులకు స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తారు. వేకువజామున గం.3.30లకు ఆలయ ద్వారాలు తెరచి ఉదయం గం. 5.00ని.ల నుంచి మధ్యాహ్నం గం.3.30ల వరకు, తిరిగి సాయంత్రం గం. 5.30 నుండి రాత్రి గం.10,00ల వరకు దర్శనాలకు అనుమతి
ఆర్జితసేవలు :
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతిరోజూ నాలుగు విడతలుగా సామూహిక అభిషేకాలు
ఉంటాయి • మొదటి విడత ఉదయం . గం. 6.30 లకు : రెండవ విడత ఉదయం గం. 8.30లకు : మూడవ విడత
ఉదయం గం. 12.30లకు : నాలగవ విడత సాయంత్రం గం.6.30లకు
సాముహిక అభిషేక సేవకర్తలకు కూడా గతంలోవలెనే స్పర్శ దర్శనానికి అవకాశం ఉండదు. • రెండు విడతలుగా ఆర్జిత హోమాలు
అన్నప్రసాదాల వితరణ :
భక్తులకు అన్నదాన భవనములో ఉదయం 10.30 నిమిషాల నుండి 03.30వరకు అన్నప్రసాదాల
వితరణ • కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్నప్రసాదాల వితరణ
- క్యూ కాంప్లెక్స్ లో దర్శనానికి వేచి ఉండే భక్తులకు మంచి నీరు,బిస్కెట్లు, అల్పాహారం, ఏర్పాటు
- లడ్డు ప్రసాదాలు :
- కార్తీకమాసంలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డు ప్రసాదాలు
సిద్ధం చేస్తారు.రద్దీకి అనుగుణంగా ప్రసాదాల విక్రయ కేంద్రాలు ఏర్పాటు
కార్తీకమాసం సందర్భంగా శివచతుస్సప్తాహ భజనలు :
- లోకకల్యాణం కోసం గతంలో వలనే ఈ సంవత్సరం కూడా కార్తీకమాసంలో అఖండ
శివచతుస్సప్తాహ భజన కార్యక్రమ నిర్వహణ. ఆలయములో నిరంతరంగా శివభజనలు.
పుష్కరిణి వద్ద లక్షదీపార్చన , పుష్కరిణి హారతి
- కార్తీకసోమవారాలు , పుష్కరిణి ” వద్ద లక్షదీ పార్చన, పుష్కరిణి హారతి. కార్తీకదీపోత్సవం
- భక్తులు కార్తీకదీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తర మాడ వీధీ, గంగాధరమండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు
- పుణ్యనదీ హారతి • కార్తీక పౌర్ణమి రోజున కృష్ణవేణి నదీమతల్లికి పుణ్యనదీహారతి కార్యక్రమం
పాతాళగంగ వద్ద ఉన్న కృష్ణవేణీ విగ్రహానికి పూజాదికాలు. జ్వాలా తోరణం
- కార్తీక పౌర్ణమి రోజున ఆలయం ముందుగల గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణం
- సాంస్కృతిక కార్యక్రమాలు • ఆలయ నిత్యకళావేదిక వద్ద ప్రతిరోజు ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు.
లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి రోజులలో పుష్కరిణి వద్ద ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు