
శ్రీశైల దేవస్థానం:• ఈ రోజు (24.12.2021)న జరిగిన దేవస్థానం హుండీల లెక్కింపు:
• భారీమొత్తంలో హుండీఆదాయం
• 30 రోజులలో రూ. 5 కోట్లకు పైగా లభించడం ఇదే మొదటిసారి
• బంగారు – 459 గ్రాములు 400 మిల్లీగ్రాములు
• వెండి – 14 కేజీల 250 గ్రాములు
శ్రీశైల దేవస్థానం:ఈ రోజు (24.12.2021)న జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 5,02,45,391/-లు నగదు రాబడిగా లభించిందని ఈ ఓ ఎస్.లవన్న తెలిపారు.
ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 30 రోజులలో సమర్పించారు. ఇంత భారీస్థాయిలో రావడం ఇదే మొట్టమొదటిసారి అని ఈ ఓ ఎస్.లవన్న తెలిపారు.
హుండీల లెక్కింపులో 459 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారం మరియు 14 కేజీల 250 గ్రాముల వెండి లభించాయి. .
అదేవిధంగా 3,700 యు.ఎస్.ఏ డాలర్లు, 105 కెనడా డాలర్లు, 35 కత్తార్ రియాల్స్, 45 యు.ఎ.ఈ, దిర్హమ్స్, 5 ఎస్.ఏ.యు రియాల్స్, 1 కువైట్ దినార్, 1 జపాన్ ఖియాన్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును జరిగింది.
దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులుఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.