
శ్రీశైల దేవస్థానం:ఈ రోజు (02.11.2021)న జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 2,69,92,477/-లు నగదు రాబడిగా లభించింది.
ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 28 రోజులలో సమర్పించారు.
ఈ హుండీల లెక్కింపులో 170 గ్రాముల బంగారం మరియు 8 కేజీ 450 గ్రాముల వెండి లభించాయి.
185 యు.ఎస్.ఏ డాలర్లు, 10 యు.ఎ.ఈ. దిర్హమ్స్ , 135 ఇంగ్లాండ్ పౌండ్స్, 4 కత్తార్ రియాల్స్, 5 కెనడా డాలర్లు, 2 సింగపూర్ డాలర్లు , 190 సౌది రియాల్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. .
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేసారు.
దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.