హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ: 4,69,85,974/-లు నగదు రాబడి

 శ్రీశైల దేవస్థానం:ఈ రోజు (18.09.2021)న జరిగిన  శ్రీశైల దేవస్థానం హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ: 4,69,85,974/-లు నగదు రాబడిగా లభించిందని ఈ ఓ ఎస్.లవన్న  తెలిపారు.

ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 30 రోజులలో సమర్పించారు.

 ఈ హుండీల లెక్కింపులో 333 గ్రాముల బంగారం , 8 కేజీల 800 గ్రాముల వెండి లభించాయి.

 159 యు.ఎస్.ఏ డాలర్లు, 15 కెనడా డాలర్లు, 1500 యూరోస్, 115 ఇంగ్లాండ్ డాలర్లు, 15 కెనడా డాలర్లు, 13 కువైట్ దిర్హమ్స్, 3 కత్తార్ రియాల్స్, 2 సింగపూర్ డాలర్లు మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.

పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును జరిగిందని ఈ ఓ తెలిపారు.

దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది,  శివసేవకులు ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed