
శ్రీశైల దేవస్థానం: రెండో శనివారం, ఆదివారం ( రెండు రోజులు సెలవుదినాలు కావడం), 10న సోమవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం శ్రీ స్వామి అమ్మవార్ల సౌకర్యవంతమైన దర్శనం, వసతికల్పన మొదలైన ఆయా ఏర్పాట్లను చేస్తోంది.
భక్తుల రద్దీ కారణంగా శ్రీస్వామివార్ల గర్భాలయం అభిషేకాలు, స్పర్శ దర్శనాలు పూర్తిగా నిలుపుదల చేసారు. భక్తులందరికీ కూడా శ్రీ స్వామివార్లఅలంకార దర్శనానికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు.
అదేవిధంగా సామూహిక అభిషేక సేవాకర్తలకు కూడా అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం ఉంది.
అమ్మవారి అంతరాలయములో కూడా ఆర్జిత కుంకుమార్చనలు పూర్తిగా నిలుపుదల చేసారు. అమ్మవారి అలయములోని ప్రాకారమండపంలో ఆర్జిత కుంకుమార్చనలను (రూ. 500/-ల రుసుముతో) నిర్వహిస్తున్నారు.
శనివారం నుండి సోమవారం వరకు ఇదే విధానం అమలు చేయాలని నిర్ణయించారు.
ఈ రోజు వేకువజామున 3.00గంటలకు ఆలయద్వారాలు తెరచి మంగళవాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాత:కాలపూజలు, మహామంగళహారతి కార్యక్రమాలు చేసారు. అనంతరం 5గంటల నుండే భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
ఈ రోజు ఉదయం నుండే భక్తులు భారీ సంఖ్యలో క్యూలైన్లలో వేచి ఉండడం కనిపించింది.
క్యూలైన్లలోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వుండేందుకు ఎప్పటికప్పుడు మంచినీరు, అల్పాహారం అందించారు. ఈ సాయంకాలం కూడా అల్పాహారాన్ని అందించారు.
ఈ రోజు ఉదయం క్యూలైన్లలోని భక్తులకు వేడిపాలు కూడా అందించారు.
ముఖ్యంగా వృద్ధులు, రక్తపోటు, మధుమేహంతో బాధపడేవారికి, చిన్నపిల్లలకు ఈ అల్పాహారవితరణ ఎంతో ఉపశమనాన్ని కలిగించింది.
దేవస్థాన అన్నప్రసాద వితరణ భవనంలో ఉదయం 10గంటల నుండే భక్తులరద్దీకనుగుణంగా అన్నప్రసాదాలు (భోజనప్రసాదాలు) కూడా అందించారు.
భక్తులరద్దీకనుగుణంగా తగినన్నీ లడ్డుప్రసాదాలను కూడా అందుబాటులో ఉంచారు..
సర్వదర్శనానికి సుమారు 4 గంటలకు పైగా సమయం పట్టగా, శీఘ్రదర్శనానికి (రూ.150/-ల దర్శనం) దాదాపు 3 గంటలు, అతిశీఘ్ర దర్శనానికి (రూ.300/-ల టికెట్) 2 గంటల సమయం పడుతోంది.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వుండేందుకు ఆయా విభాగాధికారులందరు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు,