
హైదరాబాద్: హయత్ నగర్ మండలం మునగనూరు శ్రీ రామానుజ నగర్ కాలనీలోని శ్రీ గోవింద క్షేత్రంలో నూతన దేవాలయ ప్రతిష్ఠా మహోత్సవం శుక్రవారం నాడు సాయంత్రం శోభాయాత్రతో ప్రారంభమైంది. శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయ నిర్మాణం శోభాయమానంగా జరిగింది. శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళాశాసనములతో శ్రీ త్రిదండి శ్రీరామచంద్ర జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ క్షేత్రం రూపుదిద్ధుకుంది. ఈ నెల రెండో తేదీ నుంచి 8 వ తేదీ వరకు మహోత్సవ కార్యక్రమాలు వుంటాయి. పూర్తి కార్యక్రమ వివరాలు ఇదివరకే క్షేత్రం సమన్వయకర్తలు పీవీ నరసింహా రావు, నారాయణ ప్రసాద్ అసావా, శ్రీమతి రమేష్ ప్రతిభా తెలిపారు. ఈ రోజు సాయం సమయంలో వరుణుడి కటాక్షం తో ఏర్పడిన చక్కని చల్లని వాతావరణంలో శోభాయాత్ర మునగనూరు ప్రధాన వీధుల్లో సాగి మళ్ళీ దేవాలయానికి చేరింది. దేవాలయంలో ఉత్సవ ఏర్పాట్లు ఘనంగా ఉన్నాయి. దేవాలయం నుంచి కాలనీ ఆర్చ్ వరకు విద్యుత్ దీపాలంకరణ చేశారు