
శ్రీశైల దేవస్థానం:ఆషాఢమాసం సందర్భంగా మంగళవారం శ్రీకృష్ణ దత్తసాయి సేవాసమితి అధ్యక్షురాలు శ్రీమతి సాహితీరెడ్డి ఆధ్వర్యంలో ఆ సమితి సభ్యులు , శివసేవకులు మొత్తం 200 మంది భక్తులు శ్రీ భ్రమరాంబాదేవివారికి సారె సమర్పించారు.
ఈ సమర్పణలో పసుపు, కుంకుమ, పలు రకాల పూలు, పండ్లతో సారెను సమర్పించారు. శ్రీమల్లికార్జునస్వామివారికి, బయలు వీరభద్రస్వామివారికి, సాక్షిగణపతిస్వామివారికి, పలు ఉపాలయాల దేవతా మూర్తులకు వస్త్రాలను కూడా సమర్పించారు.