
శ్రీశైల దేవస్థానం:శ్రావణ మాసోత్సవాల నిర్వహణకు కార్యనిర్వహణాధికారి దిశానిర్దేశం చేశారు. శ్రావణ శుద్ధ పాడ్యమి, ఆగస్టు 5వ తేదీ నుంచి సెప్టెంబరు 3 (శ్రావణమాస అమావాస్య) వరకు శ్రావణ
మాసోత్సవాలు నిర్వహిస్తారు.
ఈ ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి సోమవారం కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు సమీక్షా
సమావేశాన్ని నిర్వహించారు.
పరిపాలనా కార్యాలయములోని సమావేశ మందిరం లో జరిగిన సమీక్షలో ఉభయ
దేవాలయాల ప్రధానార్చకులు , అధ్యాపక, సీనియర్ వేదపండితులు, అన్ని విభాగాల యూనిట్ అధికారులు,
పర్యవేక్షకులు, ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
ఆయా విభాగాల వారిగా చేపట్టవలసిన చర్యల గురించి కార్యనిర్వహణాధికారి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ శ్రావణ మాసములో ముఖ్యంగా శ్రావణ
సోమవారాలు, శ్రావణ పౌర్ణమి, వరలక్ష్మీవ్రతం, శుద్ధ , బహుళ ఏకాదశి రోజులు, శ్రావణ మాసశివరాత్రి
, ప్రభుత్వ సెలవురోజులలో అధికసంఖ్యలో భక్తులు ఆలయానికి సందర్శించే అవకాశం ఉందన్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచేకాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుంచి , పలు ఉత్తరాది
రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రాన్ని సందర్శిస్తారన్నారు ఈ ఓ .భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల వారు కూడా ముందస్తుగా ఆయా ఏర్పాట్లను
చేయాలని ఆదేశించారు.ముఖ్యంగా భక్తులందరికీ కూడా సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకుగాను అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆలయ విభాగాన్ని ఆదేశించారు.
అయిదురోజులపాటు అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం:
శ్రావణ మాసంలో అయిదు రోజులపాటు ఆగస్టు 15 (శ్రావణ శుద్ధ దశమి) నుంచి
( శ్రావణపౌర్ణమి) 19 వరకు భక్తులకు శ్రీస్వామివారి అలంకారదర్శనం మాత్రమే కల్పించాలని
సమావేశంలో నిర్ణయించారు. ఈ అయిదు రోజులలో శ్రీస్వామివారి స్పర్శదర్శనానికి
అవకాశం ఉండదు. ఏకాదశి, వరలక్ష్మీ వ్రతం, శ్రావణపౌర్ణమి మొదలైన పర్వదినాల కారణంగా
ఈ రోజులలో భక్తులు అధికసంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తారు.
* భక్తుల రద్దీ కారణంగా శ్రావణ శనివారాలు, శ్రావణ ఆదివారాలు శ్రావణ సొమవారాలుు స్వాతంత్ర్య
దినోత్సవం వరలక్ష్మీ వ్రతం, పార్థమి మొదలైన రోజులలో గర్బాలయ
అభిషేకాలు. సామూహిక అభిషేకాలు , ఆర్థిత. కుంకుమార్చనలు నిలువుదల
చేస్తారు.
*అభిషేకాలు నిలుపుదల చేసిన నిర్దిష్ట రోజులలో 15.08.2024 నుంచి 19.08.2024 వరకు అనగా
అయిదురోజులు మినహా రోజుకు నాలుగు విడుతలుగా స్వామివార్ల స్పర్శ దర్శనం
కల్పిస్తారు.
ఈ స్పర్శదర్శన టికెట్లను ప్రస్తుతం అమలులో ఉన్నట్లుగానే దేవస్థానం వెబ్సైట్
ద్వారా ఆయా టికెట్లను ముందస్తుగా పొందవచ్చు.
* మిగతా రోజులలో గర్భాలయ ఆర్జిత అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, కుంకుమార్చనలు
యథావిధిగా కొనసాగుతాయి.
* భక్తులు వివిధ ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్ ద్వారానే పొందవలసివుంటుంది. ఈ టికెట్లను కూడా
లభ్యతను బట్టి గంట ముందు వరకు కూడా భక్తులు పొందవచ్చు.
*ఆలయ వేళలు
* ప్రస్తుతం అమలులో ఉన్న విధంగానే ప్రతీరోజు వేకువ జామున గం.3.00లకే ఆలయ ద్వారాలు తెరచి
మంగళ వాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాతకాలపూజలు వుంటాయి.
* ఉభయ దేవాలయాలలో గం.4.30 నుంచి మహా మంగళ హారతులు వుంటాయి.
* మహా మంగళహారతుల ప్రారంభం నుంచే అనగా గం.4.30లకే భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు.
* సాయంత్రం గం. 4.00ల వరకు సర్వదర్శనం వుంటుంది.
* తిరిగి సాయంకాలం గం.4.00 నుంచి ఆలయశుద్ధి కార్యక్రమం నిర్వహించి మంగళ వాయిద్యాలు,
ప్రదోషకాలపూజలు, తరువాత గం.5.30ల నుంచి మహా మంగళహారతులు
వుంటాయి.
* మహా మంగళహారతుల ప్రారంభం నుంచే సాయంకాలం గం. 5.30ల నుంచే రాత్రి గం.
11.00ల వరకు దర్శనాలు కొనసాగుతాయి.
ఉచితంగా సామూహిక వరలక్ష్మీ వ్రతములు:
* శ్రావణ మాసంలో భక్తుల కు రెండు పర్యాయాయాలు ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతములు
జరిపిస్తారు.
* రెండవ శుక్రవారం రోజున 16.08.2024న 1250 మంది భక్తులకు ,
తెల్లరేషన్కార్డు కలిగిన 250 మంది భక్తులకు మొత్తం 1500 మంది ముత్తైదువులకు ఈ వ్రతం
అవకాశం కల్పిస్తారు.
* అదేవిధంగా శ్రావణ నాలుగో శుక్రవారం 30.08.2024 న ప్రత్యేకంగా 500 మంది
చెంచు ముత్తైదువులకు, 1000 మంది ఇతర భక్తులకు ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
వుంటాయి.
*సామూహిక వరలక్ష్మీ వ్రతం జరిపించుకునే భక్తులందరికీ ప్రసాదాలతో పాటు చీర , రవిక
వస్త్రం, గాజులు, పసుపు కుంకుమలు, కైలాస కంకణాలు, శ్రీశైలప్రభ మాసపత్రిక కూడా
అందిస్తారు.
* కాగా వ్రతకర్తలకు శేషవస్త్రంగా చీరను అందజేయడం ఇదే మొదటిసారి.
వ్రతకర్తలకు శ్రీస్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించడంతో పాటు అన్నప్రసాద వితరణ భవనములో భోజన
ప్రసాదం అందిస్తారు
పరోక్షసేవగా వరలక్ష్మీ వ్రతము :
భక్తుల సౌకర్యార్ధమై పరోక్ష ఆర్జితసేవగా వరలక్ష్మీ వ్రతము చేసుకునే అవకాశాన్ని దేవస్థానం
కల్పించింది.
ఈ పరోక్షసేవకు రూ. 1116-00లను రుసుముగా నిర్ణయించారు..
పరోక్షసేవగా జరిపించుకున్న భక్తులకు కుంకుమ, విభూతి, కలకండ ప్రసాదం, అక్షితలతో పాటు
అమ్మవారి ప్రసాదంగా చీర, రవిక వస్త్రం పోస్టు ద్వారా పంపుతారు.
దేవస్థానం వెబ్సైట్ ద్వారా భక్తులు పరోక్షసేవలను నమోదు చేసుకోవలసివుంటుంది.
కాగా సమావేశంలో కార్యనిర్వహణాధికారి ఏర్పాట్లకు సంబంధించి ఆయా విభాగాల వారిగా పలు
ఆదేశాలు జారీచేశారు.
క్యూలైన్లలో వేచివుండే భక్తుల సౌకర్యార్థం భక్తులందరికీ కూడా ఎప్పటికప్పుడు మంచినీరు,
అల్పాహారం , బిస్కెట్లను అందజేయాలని అన్నప్రసాద వితరణ విభాగాన్ని ఆదేశించారు.
అదేవిధంగా భక్తులరద్దీకనుగుణంగా అన్నదాన మందిరంలో అన్నప్రసాద వితరణను, సాయంకాలం
అల్పాహారాన్ని ఏర్పాటు చేయాలని అన్నదాన విభాగాన్ని ఆదేశించారు.
భక్తులరద్దీకనుగుణంగా అవసరమైన మేరకు అడ్డూప్రసాదాలను తయారు చేసి అందుబాటులో
ఉంచాలని ప్రసాదాల విభాగాన్ని ఆదేశించారు.
భక్తులు లడ్డూప్రసాదాల కోసం అధిక సమయం వేచివుండకుండా త్వరితంగా లడ్డూప్రసాదాలను
అందజేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
రద్దీరోజులలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు క్రమబద్దీకరణకు చర్యలు చేపట్టాలని భద్రతా
విభాగాన్ని ఆదేశించారు. ఈ విషయమై స్థానిక పోలీస్ శాఖ వారి సహకారాన్ని పొందాలని
సూచించారు.
భక్తులరద్దీ దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ కనబర్బాలన్నారు ఈ వో . ఎప్పటికప్పుడు
చెత్తాచెదారాలను తొలగించేందుకు తగు చర్యలు చేపట్టాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు.
అఖండ శివనామ భజనలు :
లోక కల్యాణం కోసం శ్రావణ మాసమంతా శ్రావణశుద్ధ పాడ్యమి ( 05.08.2024) నుండి
బాధ్రపదశుద్ధ పాడ్యమి. (04.09.2024 ) వరకు అఖండ శివనామ భజనలు
జరిపిస్తారు.
ఈ అఖండ భజనలలో మొత్తం 7 భజన బృందాలకు అవకాశం.
ఒక్కొక్క భజన బృందంలో 45 మంది పాల్గొనే అవకాశం వుంటుంది.