×

ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టనున్నాం-ముఖ్యమంత్రి రేవంత్

ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టనున్నాం-ముఖ్యమంత్రి రేవంత్

ప్రజా భవన్ లో “రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం” ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.  ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  స్పీచ్ పాయింట్స్…

  • నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగింది..
  • త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడింది.
  • నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ప్రాధాన్యత.
  • అందుకే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించాం.
  • గత పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగింది.
  • యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని మార్పులు చేశాం.
  • గ్రూప్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వాహించాం… డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయి.
  • నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్2 పరీక్ష వాయిదా వేశాం.
  • ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే.
  • పకడ్బందీ ప్రణాళికతో పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  • ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టనున్నాం.
  • ఇక నుంచి ప్రతీ ఏటా మార్చ్ లోగా అన్ని శాఖలలో ఖాళీల వివరాలు తెప్పించుకుంటాం.
  • జూన్ 2లోగా నోటిఫికేషన్ వేసి డిసెంబర్ 9లోగా నియామక ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం.
  • మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సింగరేణి సంస్థకు అభినందనలు.

……………………………………………………………………………………………………………

 

print

Post Comment

You May Have Missed