
శ్రీశైల దేవస్థానం:దేవస్థానంలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా దేవస్థాన పరిపాలనా కార్యాలయ భవనం ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ
కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మహాగణపతిపూజ
జరిపారు. తరువాత జాతిపిత మహాత్మగాంధీ చిత్రపటానికి పుష్ప్రమాలను అర్పించారు.
అనంతరం దేవస్థానం రక్షణ సిబ్బంది , దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్
ఫోర్స్, హోమ్గార్డ్స్ సిబ్బంది పతాక వందనం చేశారు.
కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి,
జెండావందనాన్ని చేశారు. అనంతరం జాతీయగీతం ఆలాపించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి. ప్రసంగిస్తూ గత సంవత్సర కాలములో దేవస్థానం
సాధించిన ప్రగతిని వివరించారు.
శ్రీశైలమహాక్షేత్ర అభివృద్ధికి దేవస్థానం పలు చర్యలు చేపట్టిందన్నారు ఈ ఓ.
వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించడం, భక్తులకు
సౌకర్యాలకల్పన, క్షేత్రాభివృద్ధికి అనే త్రిముఖ వ్యూహంతో దేవస్థానం ముందుకెళ్ళడం జరుగుతోందన్నారు.
రోజురోజుకు క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. భక్తుల రద్దీకనుగుణంగా
ఆయా సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంలో భాగంగా రూ. 35 కోట్ల అంచనా వ్యయంతో 7
మెగావాట్ సోలార్ పవర్ ప్లాంటును నిర్మించాలని దేవస్థానం భావిస్తుందని, దీని ద్వారా రోజుకు సుమారు
31వేల యూనిట్లు దాకా విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు. ఈ విద్యుత్పుత్తి వలన సంవత్సరానికి
రూ.7 కోట్ల దాకా విద్యుత్ చార్జీలు దేవస్థానానికి ఆదా అవుతుందన్నారు.
మంచినీటి సరఫరాలో భాగంగా మల్లమ్మకన్నీరు, హాటకేశ్వరం, ఫిల్టర్బెడ్ మొదలైనచోట్ల
రూ.6. 20 కోట్ల అంచనా వ్యయంతో మంచినీటి ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
అమ్మవారి ఆలయంలో ఉత్తర సాలుమండపాలను రూ.0.99 కోట్ల అంచనా వ్యయంతో
పునర్నిర్మించడం జరుగుతుందన్నారు. ఇటీవల పునర్నిర్మించబడిన పంచమఠాల చుట్టూ రూ. 0.86 కోట్ల
అంచనా వ్యయంతో కంచె నిర్మాణాన్ని పూర్తి చేశామని పేర్కొన్నారు.
అలంకార మండపాన్ని నూతనంగా నిర్మించామని ఈ ఓ అన్నారు. రూ. 60 లక్షల వ్యయంతో దేవస్థానం ఆగమపాఠశాల అభివృద్ధి
పనులను చేపట్టామని అన్నారు. గణేశ సదనం ఎదురుగా మినీ కల్యాణకట్టను నిర్మిస్తున్నామన్నారు.
దేవస్థానం స్వర్ణరథాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా నూతనంగా రథం షెడ్డును నిర్మిస్తున్నామని,
దోర్నాలలోని మన దేవస్థాన సత్రములో కల్యాణమండపాన్ని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.
ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలతోపాటు మరోవైపు చేపట్టడం జరుగుతోందన్నారు.
శ్రీశైలమహాక్షేత్రంలో పారిశుద్ధ్య నిర్వహణకు పలు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
రోజువారి పారిశుద్ధ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నామన్నారు.
భక్తులకు ఆహ్లాదం కలిగే విధంగా శ్రీశైలక్షేత్రాన్నంతా నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యాన్ని
నిర్దేశించుకోవడం జరిగిందన్నారు.
ప్రాచీన కాలం నుంచి కూడా మన ఆలయాలు సాంస్కృతిక కేంద్రాలుగా విలసిల్లాయాని తెలుపుతూ
ఆలయ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం అన్నివిభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షులు, సిబ్బంది
| పాల్గోన్నారు.