
శ్రీశైల దేవస్థానం:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అయిదో రోజు మంగళవారం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు
జరిగాయి. యాగశాల లో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు జరిపారు.అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిగాయి.ఈ సాయంకాలం ప్రదోష కాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిగాయి.
రావణ వాహనసేవ:
వాహన సేవలలో భాగంగా సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు రావణ వాహనసేవ నిర్వహించారు.
ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో రావణ వాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. తరువాత శ్రీశైలక్షేత్ర ప్రధాన వీధులలో గ్రామోత్సవం జరిగింది. నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంబాయ్ డొల్ థాషా, మహిళా వీరగాసి కన్నడ జానపద కళా ప్రదర్శన, పురుషులు వీరగాని కన్నడ కళా ప్రదర్శన, కాళికా నృత్యం, జాంజ్పథక్, జానపద పగటి వేషాలు, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి, డోలు విన్యాసం తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించారు.
*మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కాణిపాకం దేవస్థానం వారు శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ
• కాణిపాకం దేవస్థానం తరుపున పట్టువస్త్రాలు సమర్పించిన ధర్మకర్తల మండలి అధ్యక్షులు ఎ. మోహన్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి ఎ. వెంకటేష్