పట్టువస్త్రాలను సమర్పించిన శ్రీశైల దేవస్థానం  ధర్మకర్తల మండలి

శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం   ధర్మకర్తల మండలి తరుపున శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.  కార్యక్రమం లో ధర్మకర్తల మండలి అధ్యక్షులురెడ్డివారి చక్రపాణిరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులుమఠం విరూపాక్షయ్యస్వామి, గురుమహాంతు ఉమామహేష్, శ్రీమతి ఎం. విజయలక్ష్మి శ్రీమతి బి. రామేశ్వరి, శ్రీమతి ఎ. లక్ష్మీ సావిత్రమ్మ, శ్రీ ఓ. మధుసూదన్ రెడ్డి, శ్రీమతి సూరిశెట్టి మాధవీలత, శ్రీమతి డా. సి. కనకదుర్గ పాల్గొన్నారు.

 ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి కార్యనిర్వహణాధికారి  ఎస్. లవన్న ధర్మకర్తల మండలి అధ్యక్షులు,  సభ్యులను ఆహ్వానించారు.తరువాత ఆలయ రాజగోపురం వద్దనే పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.తరువాత ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక జరిగాయి. అనంతరం ధర్మకర్తల మండలి సభ్యులు మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి వస్త్ర సమర్పణ చేసారు.

print

Post Comment

You May Have Missed