శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం వారు బుధవారం రాత్రి స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు.
శ్రీకాళహస్తి దేవస్థానం తరుపున ఆ దేవస్థానం ఉపకార్యనిర్వహణాధికారి ఎన్. ఆర్. కృష్ణారెడ్డి పట్టువస్త్రాలను సమర్పించారు.
ఈ కార్యక్రమ లో శ్రీకాళహస్తీశ్వరస్వామివార్ల దేవస్థానం ప్రధానార్చకులు సంబంధం గురుకుల్, అర్చకులు, వేదపండితులు, సిబ్బంది పాల్గొన్నారు.
కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి అధికారి యం. శ్రీనివాసులు, అధికారులు, అర్చకులు, వేదపండితులు, శ్రీ కాళహస్తి దేవస్థానం అధికారులకు స్వాగతం పలికారు.
అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు , వైదిక సిబ్బంది మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి వస్త్ర సమర్పణ చేశారు.
ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఉపకార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం తరుపున పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నదన్నారు.