శ్రీశైలం దేవస్థానం తరుపున కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామికి పట్టువస్త్రాల సమర్పణ

 శ్రీశైల దేవస్థానం:కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం తరుపున గురువారం  పట్టువస్త్రాలు సమర్పించారు.

ఈ నెల 7వ తేదీ నుండి ప్రారంభమైన కాణిపాక బ్రహ్మోత్సవాలు 27వ తేదీతో ముగియనున్నాయి. ఈ మేరకు శ్రీశైలదేవస్థానం దేవస్థానం కార్యనిర్వహణాధికారి  డి. పెద్దిరాజు, అర్చకస్వాములు, వేదపండితులు, పలువురు అధికారులు, తదితరులు ఈ పట్టువస్త్రాలను సమర్పించారు.

ఈ సమర్పణకు ముందుగా కాణిపాక దేవస్థాన కార్యనిర్వహణాధికారి  పి. గురుప్రసాద్, అర్చకులు, వేదపండితులు సాదరంగా ఈ దేవస్థాన అధికారులను ఆహ్వానించారు.

తరువాత సంప్రదాయబద్ధంగా మేళతాళాలతో శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించి, స్వామివారికి పూజాదికాలను జరిపించారు.

ఈ దేవస్థానం అధికారులను, అర్చకులను కాణిపాక కార్యనిర్వహణాధికారి, అర్చకస్వాములు, వేదపండితులు వేదాశీర్వచనముతో సత్కరించారు.

ఆలయ సంస్కృతి సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిసంవత్సరం వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల సమయములో శ్రీశైల దేవస్థానం తరపున ఈ పట్టువస్త్రాలను సమర్పిస్తున్నారు. 

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.