
ఆజాది కా అమృత్ మహోత్సవ్ భాగంగా ప్లా స్టిక్ వాడకం, ప్లాస్టిక్ వ్యర్థాల ద్వారా పర్యావరణానికి కలిగే హానిని వీలైనంత తగ్గించే క్రమంలో అక్టోబర్ మాసం లో క్లీన్ ఇండియా పేరు మీదుగా భారత దేశం లోని అన్ని గ్రామాలు , పట్టణాలలో ప్లాస్టిక్ వ్యర్థాలను సమీకరించి డంపింగ్ యార్డ్ లకు తరలించాలని నిశ్చయించారు.
ఈరోజు కర్నూలు జిల్లాలో నెహ్రు యువ కేంద్ర సంఘటన్, జిల్లా జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ లో ఆజాది కా అమృత్ మహోత్సవ్ – క్లీన్ ఇండియా ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెహ్రు యువకేంద్ర కేంద్ర వాలంటీర్లు,రెడ్ క్రాస్ క్రోస్ వాలంటీర్లు, శంకరాస్ డిగ్రీ కళాశాల NSS విద్యార్థులు పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత, బ్లడ్ సెంటర్ ప్రాంగణాన్ని శుభ్రపరిచారు.
శ్రీ శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) మాట్లాడుతూ జిల్లా వివిధ శాఖల సహకారంతో అక్టోబర్ మాసంలో జిల్లాలోని మండలాలు, మునిసిపాలిటీలలోని పుణ్య క్షేత్రాలు, బస్సు స్టాండ్, రైల్వే స్టేషన్లు, విద్యా సంస్థలు మొదలగు ప్రాంతాలలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి డంపింగ్ యార్డ్ లకు తరలిస్తామని తెలిపారు. ఇతర అతిధులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించాలని, ప్లాస్టిక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు వేరు చేసి మన పరిసరాలను పరిశుబ్రన్గా ఉంచుకోవాలని కోరారు.
ఈ ప్రారంభ కార్యక్రమంలో శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) గారు, శ్రీమతి A.R.విజయరావు, డిప్యూటీ డైరెక్టర్, నెహ్రు యువ కేంద్ర సంఘటన్, ఆంధ్రప్రదేశ్ , నాగరాజ నాయుడు, ముఖ్య కార్య నిర్వహణాధికారి, సెట్కూరు , జి. రాహుల్ రెడ్డి, డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్, నెహ్రు యువ కేంద్ర సంఘటన్,కర్నూలు మొదలగు వారు పాల్గొన్నారు.
-నాగరాజ నాయుడు, ముఖ్య కార్య నిర్వహణాధికారి, సెట్కూరు, కర్నూలు.