సమాచార శాఖ లో 88 పోస్టుల భర్తీకి ఆదేశాలు

  • మంత్రి  పట్నం మహేందర్ రెడ్డి ప్రత్యేక చొరవతో తెలంగాణ ప్రభుత్వం జి.ఓ.నెం.1384 విడుదల.

హైదరాబాద్, అక్టోబర్ 05 :: సమాచార పౌర సంబంధాల శాఖలో భారీ ఎత్తున పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ప్రత్యేక చొరవతో తెలంగాణ ప్రభుత్వం జి.ఓ.నెం.1384 ను విడుదల చేసింది. ఈ జి.ఓ ద్వారా సమాచార పౌర సంబంధాల శాఖలో  ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన  పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ లోని 33 జిల్లాలలో ప్రతి జిల్లాకు ఒక సహాయ పౌర సంబంధాల అధికారిని, ఇద్దరు పబ్లిసిటీ అసిస్టెంట్ లను నియమించనున్నారు. హైదరాబాద్ లోని కమిషనరేట్ లో ఒక పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయనున్నారు.

మంత్రిగా ప్రమాణా స్వీకారం చేపట్టిన వెంటనే డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి సమాచార పౌర సంబంధాల శాఖలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత, వాహనాలు, సాంకేతిక పరికరాల కొరత ఉందనే విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. శాఖను బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని అధికారులకు హామీ ఇచ్చిన మంత్రి వెంటనే  ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావుకు సమస్యల  పై నివేదిక సమర్పించారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించే పౌర సంబంధాల శాఖను పటిష్టం చేయాలని ముఖ్యమంత్రిని  ఒప్పించడంతో సీఎం కూడా సానుకూలంగా స్పందించి పోస్టుల భర్తీకి అమోద ముద్ర వేశారు. మిగిలిన సమస్యలను కూడా వీలైనంత త్వరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి తెలిపారు. జి.ఓ.నెం.1384 విడుదల పై  సమాచార శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు, క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించి స్టాఫ్ ను కేటాయించినందుకు గౌరవ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డికి, కమిషనర్ అశోక్ రెడ్డికి, డైరెక్టర్ రాజమౌళి కి ఇతర ఉన్నతాధికారులందరికీ సమాచార శాఖ అధికారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.