ఇళ్ల వద్దకే వాలంటీర్ల ద్వారా పింఛను డబ్బులు

అమరావతి: రాష్ట్ర‌వ్యాప్తంగా వైయ‌స్ఆర్ పింఛ‌న్ కానుక పంపిణీ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. ల‌బ్ధిదారుల‌కు జూన్‌ ఒకటో తేదీ నుంచే వాలంటీర్ల ద్వారా పింఛను డబ్బులు పంపిణీ చేస్తున్నారు.  కొత్తగా మంజూరు చేసిన వారితో కలిపి జూన్‌ ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 61,46,908 మందికి పింఛన్ల పంపిణీ జరుగుతోంది.  ఇందుకు రూ.1,497.63 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం సోమవారం సాయంత్రానికే ఆయా గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి బయో మెట్రిక్‌ విధానంలో డబ్బులు పంపిణీ చేస్తున్నారు.

కొత్త‌గా మ‌రో 29,961 మందికి పింఛ‌న్లు

రాష్ట్ర వ్యాప్తంగా మరో 29,961 మంది పేదలకు ప్రభుత్వం కొత్తగా ఈ నెలలో పింఛన్లు మంజూరు చేసినట్టు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 1,726 మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ప్రతి నెలా రూ.10 వేల చొప్పున, మరో 28,235 మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితరులకు సాధారణ పింఛన్లను ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసినట్టు పేర్కొన్నారు.

*కర్నూలు జిల్లాలోని వివిధ రకాల 4,47,873 మంది పెన్షన్ దారులకు ఈ రోజు మధ్యాహ్నం 03:00 గంటలకు 3,78,141 మందికి 84.43 శాతం పెన్షన్లు పంపిణీ చేసారని అధికారిక సమాచారం.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.