శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం మూలా నక్షత్రం , ఆదివారాన్ని పురస్కరించుకుని దేవస్థానం రాత్రి శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించింది.
పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి , మూలా నక్షత్రం రోజులలో దేవస్థాన సేవగా (సర్కారి సేవగా) నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవాసంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపారు.
అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో వేంచేబు చేయించి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు జరిపారు.
ఆ తరువాత పల్లకీ ఉత్సవం జరిగింది