శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణంకోసం దేవస్థానం ఆదివారం రాత్రి శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీ
ఉత్సవం నిర్వహించింది.
పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి , మూలా నక్షత్రం రోజులలో దేవస్థాన సేవగా (సర్కారి సేవగా) నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవాసంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిగింది.
అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో వేంచేబు చేయించి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు చేశారు.ఆ తరువాత పల్లకీ ఉత్సవం నిర్వహించారు.