అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ

 శ్రీశైల దేవస్థానం:చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారం రోజున ( ఏ రోజుముందుగా వస్తే ఆ రోజు) శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సంవత్సరం ఏప్రిల్ 11న ఈ కుంభోత్సవం నిర్వహిస్తారు.

అమ్మవారికి సాత్వికబలి నిర్వహించేందుకు ( కొబ్బరికాయలు,గుమ్మడికాయలు, నిమ్మకాయలు, మొదలగునవి సమర్పించడం) ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితి. కుంభోత్సవం రోజున స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం.

కాగా ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం,  శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పించడం జరుగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం,ఈ రోజున అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ముందుగా అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు, కుంకుమలతో వాటికి పూజాదికాలు జరిపించారు. తరువాత అమ్మవారికి ఈ కొబ్బరికాయలు సమర్పించారు.

*Kumara swamy puuja performed in the temple.

*సాంస్కృతిక కార్యక్రమాలు*

ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) మంగళవారం  శ్రీ తాతా సందీపశర్మ, రాజమహేంద్రవరం  శివకల్యాణం ప్రవచన కార్యక్రమం సమర్పించారు.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద  సాయంకాలం 6 గంటల నుండి ఈ ప్రవచన కార్యక్రమం జరిగింది.

* B. Syam Sundar, Ananthapuram donated Rs.1,00,000 for Anna Prasadha Vitharana.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.