
ఉత్తర భారత దేశ, నేపాల్ ముక్తినాధ్ యాత్ర
హైదరాబాద్: నైమిషారణ్యంలో 01.05.2023 నుండి 08.05.2023 వరకు శ్రీమన్ ఉ:వే:ప్ర: కిడాంబి భక్తవత్సల స్వామి,వాణమామలై మఠం, నెల్లూరు ప్రత్యక్ష పర్యవేక్షణలో, S.T.P.భాస్కరాచార్యులు ఆధ్వర్యంలో, శ్రీ భాగవత సప్తాహము జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. 08.05.2023 నాడు మహా పూర్ణాహుతి, రుక్మిణి కల్యాణం జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఆ సాయంకాలం కానీ, 09.05 2023 న ఉదయం 7.00 గంటల కు నైమిషారణ్యం నుండి ఉత్తర భారత, నేపాల్ ముక్తినాధ్ యాత్రకు బయల్దేరి 23.05.2023 నాడు హైద్రాబద్ కు చేరుకునేవిధంగా కార్యక్రమాలు ఉంటాయన్నారు. భాగవత సప్తాహము లో పాల్గొనే స్వాములు 02.05.2023 ఉదయానికి నైమిషారణ్యము చేరవలసి ఉంటుందని నిర్వాహకులు వివరించారు.
ఉత్తర భారత మరియు నేపాల్ యాత్ర లో దర్శింప క్షేత్రములు.
1. నైమిషారణ్యం
2. అయోధ్య
3. లుంబిని ( నేపాల్ బుద్ధుని జన్మస్థలి)
4.ఫోఖ్రా. ( నేపాల్ )
5. గండకి ( సాలగ్రామం )
6. ముక్తినాధ్
7. మనోకమన ఆలయం
8. జల శయన నారాయణ ఆలయం
9. ఖాట్మండు పశుపతి నాధ్ ఆలయం
10.నారాయణ ఘాట్ ఆలయం
11.మిదిలా నగర్ ,జనకపురి ( సీతా దేవి జన్మస్థలి)
12. విష్ణు గయ
13. ప్రయాగ
14. వారణాసి( కాశి )
ఈ యాత్రకువచ్చే వారు. హైదరాబాద్ నుండి తిరిగి హైదరాబాద్ వరకు స్లీపర్ రైల్ ఛార్జి, నేపాల్ బస్ ఛార్జ్,సాపాట్లు(భోజనాలు), వసతితో కలిపి ప్రతి ఒక్కరు చెల్లించవలసిన మొత్తం తదితర వివరాలకు తమని సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.
ఫోన్ నంబర్స్ :
1. S.T.P. భాస్కరాచార్యులు. 9490300472,9849327472 .
2. నామవరపు వెంకటేశ్వర రావు. 9490302236.