
*Mouli,Machilipatnam*
మచిలీపట్నం: muda చైర్మన్ గా బూరగడ్డ వేదవ్యాస్ సెప్టెంబర్ 5 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు . సీఎం చంద్రబాబు నాయుడు తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు ఇస్తున్నారని బూరగడ్డ వేదవ్యాస్ ఈరోజు ఉదయం మీడియా సమావేశంలో చెప్పారు . ఆర్ & బి గెస్ట్స్ హౌస్ లో జరిగిన సమావేశంలో బూరగడ్డ వేదవ్యాస్ తో పాటు మంత్రి కొల్లు రవీంద్ర , ఎంపీ కొనకళ్ల నారాయణ ,ఎంఎల్సీ బచ్చుల అర్జునుడు, మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు . సెప్టెంబర్ 5 న muda చైర్మన్ గా ప్రమాణ స్వీకారం రెవెన్యూ కల్యాణ మండపంలో జరుగుతుందని వేదవ్యాస్ తెలిపారు . మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బూరుగడ్డ వారికి ఎంతో రాజకీయ అనుభవం ఉందని కొనియాడారు . ఇక కొత్త బాధ్యతలతో మున్ముందు మచిలీపట్నం రూపురేఖలే మారిపోతాయని చెప్పారు . ఈ పదవికి వేదవ్యాస్ సమర్థుడని పేర్కొన్నారు . ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ వేదవ్యాస్ కు ఎంతో అనుభవం ఉందని వివరించారు . బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతకు ఎన్నుకున్నారని చెప్పారు . చంద్రబాబునాయుడు నమ్మకాన్ని తాను నిరూపించుకుంటానని చెప్పారు . muda చైర్మన్ గా తన ప్రమాణస్వీకారం కార్యక్రమానికి అందరూ రావాలని బూరగడ్డ వేదవ్యాస్ ఆహ్వానించారు . సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు.