×

ప్రభుత్వ భూముల్లోనే విశాఖ పరిపాలనా రాజధాని-మంత్రి అవంతి శ్రీ‌నివాస్

ప్రభుత్వ భూముల్లోనే విశాఖ పరిపాలనా రాజధాని-మంత్రి అవంతి శ్రీ‌నివాస్

విశాఖపట్నం: టీడీపీ నేతలు కబ్జా చేసిన భూములను పేదలకు పంపిణీ చేస్తామ‌ని మంత్రి అవంతి శ్రీ‌నివాస్ పేర్కొన్నారు.  చంద్రబాబు హయాంలో విశాఖలో  భూకబ్జాలు జరిగాయని అన్నారు. ఆదివారం ఆయన విశాఖ‌లో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, అదిప్ రాజ్‌తో క‌లిసి మీడియాతో మాట్లాడారు.

టీడీపీ నేతలపై కక్షసాధింపునకు దిగాల్సిన అవసరం తమకు లేదని.. తమది పేదల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వమని స్పష్టం చేశారు. ప్ర

ఎంతటివారైనా చర్యలు తప్పవు..
ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు ఎంతటివారైనా చర్యలు తప్పవన్నారు.  గడిచిన రెండేళ్లలో విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి అవంతి పేర్కొన్నారు.

సిట్‌ నివేదిక బయటపెడతాం..
విశాఖ భూముల కుంభకోణంపై సిట్‌ నివేదిక బయటపెడతాం.  కబ్జా చేసిన భూములను పేదలకు పంపిణీ చేస్తాం. త్వరలో ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌, భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తాం. బీజేపీ నేతలకు విశాఖపై ప్రేమ ఉంటే రైల్వే జోన్‌ తీసుకురావాలని  మంత్రి అవంతి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ భూముల్లోనే విశాఖ పరిపాలనా రాజధాని..
ప్రభుత్వ భూముల్లోనే విశాఖ పరిపాలనా రాజధాని నిర్మాణం జరుగుతుందని మంత్రి అవంతి అన్నారు. విశాఖ పరిపాలనా రాజధాని కోసం ప్రైవేట్‌ భూములు అవసరం లేదన్నారు. విశాఖలో ప్రభుత్వ భూములు పుష్కలంగా ఉన్నాయని మంత్రి తెలిపారు.

కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటాం: ఎమ్మెల్యే అదీప్‌రాజు
విశాఖలో కబ్జాకు గురైన ప్రతి సెంటు భూమిని స్వాధీనం చేసుకుంటామని ఎమ్మెల్యే అదీప్‌రాజు అన్నారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ, టీడీపీ హయాంలో విశాఖలో  భూములు  కబ్జా చేశారని.. ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు.

print

Post Comment

You May Have Missed