
శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై సోమవారం సమావేశం నిర్వహించారు.ధర్మకర్తలమండలిసభ్యులు మఠం విరూపాక్షయ్యస్వామి, శ్రీమతిఎం.విజయలక్ష్మి, ఓ. మధుసూదన్ రెడ్డి సంబంధిత విభాగాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
ధర్మకర్తల మండలి సభ్యులుమాట్లాడుతూ ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలలో జాతీయస్థాయి, రాష్ట్ర స్థాయి పేరొందిన కళాకారులచేత కూడా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు.అదేవిధంగా వర్థమాన కళాకారుల కార్యక్రమాలు, ఆర్థికంగా వెనుకబడిన కళాకారుల కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయాలన్నారు.వీటితో పాటు ఆధ్యాత్మిక ప్రవచనాలు, హరికథలు, భజన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.
సమావేశంలో శ్రీశైలప్రభ సంపాదకులు డా. సి. అనిల్ కుమార్, పర్యవేక్షకులు పి. దేవిక, సంబంధిత గుమాస్తా ఎన్. అనురాధ తదితరులు పాల్గొన్నారు.