శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శనివారం విభూది రామ్ ప్రసాద్ , వారి బృందం, రాజమండ్రి వారు శివలీలలు కంజర కథాగానం కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ కంజరీ కథా కార్యక్రమం జరిగింది.
కార్యక్రమం లో హార్మోనియం సహకారాన్ని వై. బాబి , తబల సహకారాన్ని వి. చక్రి అందించారు.
శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు జరుగుతున్నాయి.